జీవితమంటే ఆత్మకథ లాగా అందమైన పుస్తకమేమి కాదు ఎన్నో ఆటుపోట్ల అనుభవాల ప్రయాణం గమ్యం తెలిసిన ఆశల పేజీ అసంపూర్ణమే.
దేవుడిని ఓడించినా రైతు
పుార్వం దుప్పెల్లి అనే గ్రామంలో జంగయ్య అనే రైతు వుండేవాడు.
తనకున్న కొద్ది పొలంలో
పంటలను పండిస్తుా నలుగురితో కలిసి మెలసి
ఆనందంగా జీవనం సాగిస్తున్నాడు.
ఒక రోజు సాయంత్రం పుాట పచ్చని చేనులో
పనులు చేస్తుండగా
పైనుండి వెళుతున్నా దేవుడికి పచ్చగా
వున్న చేను చుాసి ముచ్చటేసింది.
మారు వేషధారణ తో
కిందకి వచ్చి రైతుతో
కాసేపు మాట్లాడుతానని
వచ్చాడు.
రైతుతో మాటల్లో మాట కలుపుతూ పంట పండించడం
చాలా సులభం భుామాత దయ పంటలు పండుతాయి అన్నాడు.
దానికి రైతు చుాడు పెద్ద మనిషి మాటల వలన ప్రయోజనం లేదు.
వ్యవసాయం ఆషామాషీ కాదూ మీకు సులభం
అనిపిస్తే పండించి చుాపించండి అన్నాడు రైతు.
దానికి దేవుడు అలాగే అన్నాడు.
రైతుని ఓడించా నడుము కట్టాడు దేవుడు
వారిద్దరూ కలిసి వ్యవసాయం చేయడానికి పూనుకున్నారు.
దేవుడు రైతుకు కొన్ని షరతులు పెట్టాడు.
మొదటి షరతు.
మొదటి పంటలో పైకి కాసిన ధ్యానం మొత్తం
నాదే అన్నాడు దేవుడు
దానికి రైతు సరే అన్నాడు.
వాళ్లు ఇద్దరు మెుదటి పంటగా వేరుశనగ వేశారు
పంట ఏపుగా పెరిగింది దేవుడి ఆనందానికి అవధులేవు.
మనసులో దేవుడు అనుకుంటున్నాడు రైతు ఎంత పిచ్చొడు
పై పంట నాకే అంటే ఒప్పుకున్నాడని .
కొన్ని రోజుల తరువాత పంట చేతి కొచ్చింది
షరతు ప్రకారం కింద కాసిన కాయలు రైతు తీసుకున్నాడు.
దేవుడికి ఏమి మిగలలేదు.
దేవుడు రైతుతో మళ్ళీ వ్యవసాయం చేద్దాం అన్నాడు.
కానీ ఈసారి కింద కాసిన పంట నాదే అనీ షరతు పెట్టాడు.
దానికి రైతు సరే అన్నాడు.
వర్షకాలం కావడంతో రైతు ఈసారి వరి వేశాడు
పంట పచ్చగా ఏపుగా పెరిగింది దేవుడి ఆనందంగా వున్నాడు
నేనూ చాలా తెలివైన వాడినని.
పంట చేతి కొచ్చింది షరతు ప్రకారం పైకి
వచ్చిన ధ్యానం రైతు తీసుకున్నాడు.
దేవుడికి గడ్డి మిగిలింది.
రైతును ఓడించడం ఎలా
అనుకోని రైతు దగ్గరకు పోయి మనం మళ్లీ వ్యవసాయం చేద్దాం
కానీ నా చివరి షరతు
పంట కింద మీద వచ్చే పంట నాకే అన్నాడు
దానికి రైతు సరే అన్నాడు.
వరి కోసిన భూమిలో
ఈసారి రైతు మెుక్క జొన్న వేశాడు
పంట పచ్చగా నిగనిగలాడుతుంది.
దేవుడు సంతోషంగా వున్నాడు.
మనసులో అనుకుంటుండు రైతు వట్టి అమాయకుడు
పండిన పంటలో కింద పైన వచ్చే పంట నాకు ఇచ్చి
ఎట్లా గెలుస్తాడు అనుకున్నాడు.
అలా కొన్ని రోజులు గడిచినా తరువాత పంట చేతికి వచ్చింది.
షరతు ప్రకారం మధ్యలో కాసిన కాంకులను రైతు కొసుకున్నాడు
దేవుడికి చివరకు గడ్డే మిగిలింది
అప్పుడు అర్థం అయింది
రైతును ఓడించడం అంతా సులభం కాదని
దేశానికి అన్నం పెట్టే రైతు నా కన్నా గొప్పోడు అనుకున్నాడు
అక్కడి నుండి జరుకున్నాడు
శ్రమను నమ్ముకున్న వారికి విజయం ఎప్పటికైనా వరిస్తుంది
***************
వెల్మజాల నర్సింహ. 20.6.21
నిజం ఎప్పుడూ నగ్నమే-Truth is always naked
నిజం ఎప్పుడూ నగ్నమే
మనమే దానికి అబద్దమనే తొడుగులను
జత చేస్తాం
Truth is always naked
We are the liars of it
Let's add
చిరుజల్లులు
గింజకు ప్రాణాలంట మొలకెత్తడానికి
వానామ్మకు చిరునామా ఎందుకు
చిరుజల్లులు కురవడానికి
నేటి సమాజంలో
నేటి సమాజంలో
స్మార్ట్ ఫోన్ వున్న ప్రతివాడు
గొర్రెల తయారయ్యాడు వచ్చిన
ప్రతి మెసేజ్ ఫార్వర్డ్ చేయటమే.
.జీవితంలో నిన్ను నీవు నమ్ముకుంటే
అ విజయానికి తొలి మెట్టు
జేతలబావి(జలతార బావి
న్నింటికీ మాత్రమే వుంటుంది.
పుట్టిన ఊరు కన్న తల్లితో సమానం
కొన్ని గ్రామాలు కట్టడాల వలన ఫేమస్ అవుతాయి.
అలా దుప్పెల్లి గ్రామంలో వున్న జేతలబావి(జలతార బావి) గురించి చెప్పాలంటే
జలం అనగా నీరు
తార అనగా నక్షత్రాలు
స్వచ్చమైన నీటితో రాత్రిలో నక్షత్రాలు స్పష్టంగా కనిపించే విధంగా వుండేవి.
అలాగే రాత్రి వేళలో దేవ కన్యాలు వచ్చి స్నానాలు
చేసేవారేమెు శబ్ధాలు వచ్చేవి అని అక్కడ పని చేసిన పెద్దలు అంటుంటారు. ..
బావి గురించి చెప్పాలంటే కాకతీయుల
చివరి రాజు ప్రతాప రుద్రడి కాలంలో తవ్వ
బడిన స్థానిక దొర గారిది
అప్పటి కాలం సువర్ణ యుగామని చెప్పవచ్చు ఎందుకంటే
తిన్న డానికి సరైన ఆహారం లేకున్నా
వ్యవసాయ క్షేత్రాలలో దొరికే పండ్లు కాయలతో
హాయిగా జీవించేవారు.
దొరగారు ఎంతో ఇష్టంగా తవ్వించి చుట్టూ బండాలపై దేవతా ప్రతిమలను వేయించారు.
నీరు చాలా తీయగా వుండి వ్యవసాయానికి వాడేవారు.
చుట్టూ ప్రక్కల రావి మరియు పెద్ద ఊడలమర్రి చెట్టు వుండేది.
ఇరవై ముప్ఫై మంది జీతాగాండ్ల తో నిత్యం
కళకళలాడుతుండేది.
ప్రక్కనే పెద్ద పశువుల దొడ్డి తో సంతల రద్దీగా వుండేది.
కానీ నేడు దొరలు లేరు బావులా శోభలేదు
మా చిన్నతనంలో అని చెపే తాతయ్య తప్ప
*వెల్మజాల నర్సింహ*26.5.21
కామం కాదు లోకమనేది
సృష్టిలో తీయనైనది
సృష్టికే ముాలమైనది
యవ్వనంలో పరుగులైనది
యద లో పొంగే ప్రేమైనది
క్షణ కాలం బొంగారమైనది
క్షణమీడని జీవన మైనది
రతి సతి తో ఐక్యమైనది
లోకమంతా మైకమైనది
కామం గెలిచితే వీరుడనది
ప్రపంచ శాంతికి
మార్గ మనది
కామం కాదు లోకమనేది
యవత తెలుసుకుంటే భవితనది
బతుకే బతుకు
బతుకులు బత్తాయి బతుకులు
బతుకులు బతుకుతున్నామనే
సందేహం లో బతుకులు
బతుకులు మనవాళ్లు
వున్నారని భ్రమలో బతుకులు
బతుకులు చచ్చేదాక
సంపాదన ధ్యేయం బతుకులు
బతుకులు ఏవరి కోసం,
ఎందుకో బతుకులు
బతుకులు పుట్టామా
గిట్టామా బతుకులు
బతుకులు భుక్తి కోసం
పోరాట బ్రతకులు
బతుకులు భుామికోసం
బతకులు
బతుకులు భయం
భయం బతుకులు
కానీ సంతృప్తి చెందిన
బతుకే బతుకు కదా
అణగారిన జాతికే వెలుగంట
మీరు రాసింది మా తలరాతంట
ప్రపంచ మేధావి మీరంట
మీరాతలే గీతాగ నేడంట
అక్షరమే ఆయుధం నీదంట
అన్ని వర్గాలకు మేలంట
దీపం వెలుగులో చదువంట
అణగారిన జాతికే వెలుగంట
*********************
వెల్మజాల నర్సింహ 🙏🏻
ఉగాది @2021
వసంతాగమనం వచ్చింది
ఉగాది పండగ తెచ్చింది
చైత్ర మాసంలో వచ్చింది
చెట్టుకొమ్మ చిగురించింది
కాలగమనం మెుదలైంది
కోయిలమ్మ గొంతు విపింది
కొత్త సంవత్సరం వచ్చింది
యుగాదిపండుగ తెచ్చింది
కవులు కలాలు పట్టారు
కవిత్వం తో స్వాగతించారు
మామిడి కాయల సందడి
వేప పువ్వుల పందిరి
తీపి వగరు చేదు పులుపు
ఉగాది పచ్చడి చేయండి
ఊరంత పంచండి
పంచాంగాని వినండి
పరిపూర్ణంగా జీవించండి
******************
(వెల్మజాల నర్సింహ చరవాణి.9867839147)
మా నాన్న రైతు
చుట్టూ పచ్చని పంట పొలాలు.
వాటి మధ్య లో పిల్లకాలువలు
పైన చెరువు పచ్చని చీర
కట్టిన బాపు బొమ్మల వుంటుంది దుప్పల్లి
మా ఊరు.
ఐదవ తరగతిలో అనుకుంటా ప్రారంభం
ఉదయం వేకువ జామున లేచి పుస్తకం
చదువు కుంటు
పొలం కాడికి పోయి ్య
ఆవు పాలు పిండుకొన్ని
రావడం
సాయంత్రం నాలుగు
గంటలకు మళ్లీ పోవడం
నాన్నకు పొలం పనులో
సహాయం చేసి
నాన్నతో కబుర్లు కథలు చెపుతుంటే వింటూ
రావడం జరిగేది.
అప్పుడు పొలం పనులు
చేయడం వలన బాడీ
చాలా దృడంగా మారింది
పంట పొలాలు మధ్య
తిరగటం
పచ్చివి పెసర మరియు
వేరు సెనగ కాయలు
తినడం సీతాఫలాలు
రోజు వారి ఆహారమే అక్కడ.
వరి వరం పై పిల్లి పెసరు కాయలు
రామయ్య తాత జొన్న
కాంకులు .
పాలు కారే కాంకుల లో
పలుగు రాళ్ళు వేడి చేసి
వేస్తే వచ్చే రుచి బాగుండేది.
బాట వెంబడి కంది కాయలు
వేసవిలో తాటి ముంజలు
తింటూ జీవితం గడిచేది
దారి లో ఎవరైనా
మనుషులు కనబడితే
బంధువుల వలే
మనసు విప్పి మాట్లాడుకునే వారు
మా నాన్న అంటుండేవాడు
దారి ఎంత దుారం వున్న
గమ్యం గురించే ఆలోచి స్తాము అలాగే
ప్రస్తుతం చేస్తున్నా పనిపై
ఏకాగ్రత పెడితే విజయం తప్పకుండా వరిస్తుందాని.
ఒక రోజు సాయంత్రం
ఉరుములతో కుాడిన వర్షం
ఎల్లమ్మ కాలువ లో వానాకు నీరు జోరుగా
ప్రవహిస్తుంది.
కట్టపై వేప చెట్టుపై గిజిగాడు చాలా అందంగా
అలినా గుాడు లో చిన్న పిల్లలు
చలికి వణుకుతున్నాయి
చాలా బాధనిపించింది
వెళ్లి నాన్నకు చెపితే
వాటిని తీసుకొచ్చి
వెచ్చని గోగునార సంచిపై వుంచిండు
ఉదయం భానుడి
కిరణాల వేడికి
అవి ఎగురుతు గూటికి
చేరడం చూస్తే చాలా ఆనందం వేసింది.
వాటి తల్లి పిల్లల ఆనందానికి. ..
అప్పుడు మనసులో
అనిపించిన మాట. ..
ఆశలకు మరణంలేదు
అవకాశలకు కొదువే లేదు
ఆనందానికి హద్దులు వేసి
అవరోధాలను దాటేద్దాం
పేదతనం ధైర్యనిస్తుంది.
మంచి సంస్కారాన్ని నిస్తుంది.
అనడం లో సందేహం లేదు
వెల్మజాల నర్సింహ
(అగ్ని శిఖ రచయిత)
జీవితం
మావిలో జీవం పోసుకొని
బయట ప్రపంచంలోకి
రావడానికి తన శక్తినంతా కుాడా గట్టుకొని మావి ప్
రపంచం నుండి మరో ప్రపంచం లోకి వచ్చిన జీవి
తన జీవిత పోరాటం ఆనందంతొ ప్రారంభించి
అబద్దాల జీవితానికి అలవాటు పడి మెాసపొతు
మెాసం చేస్తు
జీవితమంటే ఏమిటొ తెలుసుకోకుండా
ముగిస్తుంటాడు.
కొందరి జీవితాలు చాలా
ల విచిత్రంగా వుంటాయి
కొంతమందే ఇతరులకు చాలా ప్రేరణగా నిలుస్తారు
మానవ మెదడులు అందరివి దాదాపుగా ఒకే
నిర్మాణం. కానీ కొందరే చరిత్ర వీరులౌవుతారు.
చిన్నపుడు మా అమ్మ
ఒక మాట అంటుండేది
ఒక ఊరి లో దొర గారికి
పుత్రుడు జన్మించాడు
అక్కడే చెట్టు పై కాకి కూడా అదే రోజు
ఐదు పిల్లలకు పొదిగి జీవం పోసింది.
కాకి పిల్లల పెద్దవై ఎగిరి
పొాయ్యాయి
దొర కొడుకు పెద్ద వాడై
తన తాత ముత్తాతల
ఆస్తి అనుభవిస్తు
మరణించాడు
కాకి పిల్లలకు
దొర కొడుకు పెద్ద తేడా
లేదు పుట్టడం గిట్టడం .
ప్రకృతిలో సృష్టి ధర్మం,
కానీ మనిషిగా ఆలొచించే శక్తి వుండి
దైవమిచ్చిన నీ కళను గుర్తుంచుకోకుండ జీవించి
జీవిత చరమాంకంలో
బాధ పడితే
చేతులు కాల్చుకున తరువాత
ఆకుల పట్టుకుంటే ప్రయోజనం లేదు.
నిన్ను నీవు గుర్తుంచుకో
గౌరవించుకో .
సామాజిక స్పృహ,
ఇతరులకు సహాయం చేయడం, వున్న దానితో
ఆనందంగా గడపడం
ఇదే కదా జీవితం
*******************
వెల్మజాల నర్సింహ✍🏻
కవిత్వం -II
ఊటబావిలా ఉరిస్తావు
ఉహకందని నీరిస్తావు
కలలో నువ్వే కవ్విస్తావు
కనిపించక మురిపిస్తావు
మస్తిష్కంలొ కల్లోలం సృష్టిస్తావు
పదిమందిలో మెప్పిస్తావు
నలుగురిని నవ్విస్తావు
చదువుల బడినె
వలెస్తావు
పిల్లల కోసం తల్లి వౌతావు
తెలుగు కవుల సరిగమలౌవుతావు
కవిత్వమా కాసేపు కవ్వించుమా. .
రాగాలలో గానమౌతావు
రాసే యువకుల ప్రేమౌవుతావు
విరసం, సరసాలాలతొ
సాదిస్తావు
అవధానలతొ అలరిస్తావు
అష్ట దిగ్గజాలనే ఆటాడిస్తావు
కవిత్వమా కాసేపు లాలించుమా
బాధల లో నువ్వే కనిపిస్తావు
పోరాట వీరుల తొడుంటావు
వయసుతొ పని లేదంటావు
అక్షరమే ఆయుధమై
ప్రశ్నిస్తావు
కవిత్వమా నీతోనే
పోరాటం సాగించనా
*****************
మల్లన మల్లన : SONG
మల్లన మల్లన
*************
పల్లవి:మల్లన మల్లన మల్లనో
మేము వేడుకునే దేవుడవు మల్లన
పచ్చని పల్లెలో మల్లన
నీవు స్వచ్చమైన దేవుడవు మల్లన
:మల్లన మల్లనో:
చరణం: పంట పొలాల మధ్య మల్లనో
నీకూ గుడి కట్టి కొలచు కుంటిమి మల్లన
గొడ్డు గొర్రె కాపాడమని మల్లన
మా గొడు నీకూ చెప్పుకుంటూమి మల్లన
:మల్లన మల్లనో:
చరణం: మీ కొర్రమీసం చుాసిమల్లన
మా పొరాగాళ్లు పెంచుతుండే మల్లన
నువ్వు అక్క కిచ్చే గౌరవంతొ మల్లన
మా అక్క చెల్ల లను చుాసు కుంటిమి మల్లన
:మల్లన మల్లనో:
చరణం: మా పల్లె సాలంగా చుాస్తావని మల్లన
మీకు పండుగ చేసి కొలచుకుంటాం మల్లన
మీ కమ్మనైనా కథ తోటి మల్లన
మా జీవితంలో అనుసరించితిమి మల్లన
మా పాపలు పొగొట్టామని మల్లన
నీకుా పట్నలేసి పండుగ జేసితిమి మల్లన
చరణం: మల్లన మల్లన
మల్లనో
మమ్ముల చలంగా చుాసేటి దేవుడవు మల్లన
మల్లన మల్లన మల్లనొ
నీకూ వెల వెల వందనాలు మల్లన (2)
****
వెల్మజాల నర్సింహ✍🏻
నుాతన సంవత్సరం@2021. (New Year)
మనసా నీతో ఒక మాట
మరేందుకు తొందర బయట
నీలో నువ్వే ఈపుాట
గడుపుమా కొత్త సంవత్సరం పుాట
ఆనందం లేదు బయట
అమ్మ నాన్న లతో
ఈపుాట
గడుపుమా నేడే వారి కనుల పంట
గడిచినా కాలం పెంటా
వర్తమానం పసిడి పంట
భవిష్యత్తు కాలం వెంటా
నిన్ను నువ్వు నమ్మకుంటే
సిరుల పంట
నుాతన సంవత్సరంమంటా
కలగాలి శుభాలు ప్రతి ఇంటా
***************
వెల్మజాల నర్సింహ✍🏻
సరదాకి వొడ్కా
రాత్రిరి తాగినా వొడ్కా
పొగలెక్కింది కిక్కు తడాఖా
మత్తులో వెతికినా పడక
మాగురుడు ముందే గురక
పక్కకు జరిగిన వారి పిలక
మాటల యుద్ధం కొడుకా
మౌనం మరిచితి చిలకా
ఫొన్ లో వెతికినా బొమ్మలు
మత్తెక్కిన చుాపుల కొమ్మలు
అతి తాగుడు చేసేన నష్టం
ఉదయం తెలిసేనా కష్టం
వెల్మజాల నర్సింహ
భవి భారత పౌరులం -Future citizens of India
ఉపాధ్యాయుడు -Teacher
ఆ మనిషి కొట్టినా దెబ్బలు గుర్తుకు లేవు
నేర్పించిన అక్షరం గుర్తుతుంది
అమనిషి తిట్టినా తిట్లూ గుర్తులేవు
నాలో తీసుకొచ్చిన మార్పులు గుర్తుతుంది
నాన్న తరువాత అతనే
ఆ.. మనిషి. ..టీచర్
.*_
కలివిడి మనిషికి కష్టం లేదు
ఆకాశాన్నికి హద్దులు లేవు
కోర్కెలకు మరణం లేదు
కాలాన్నికి కల్లెం లేదు
సంపాదనకు పోటీ లేదు
సంసారంలో సుఖం లేదు
జీవి లో గుండెకు ఆలుపే లేదు
కలుపు మెుక్కకు విలువే లేదు
కలివిడి మనిషికి కష్టం లేదు
***************
వెల్మజాల నర్సింహ✍🏻**
చిన్నప్పటి మిత్రుడు
మధ్యాహ్నం ఒంటి గంట
కావస్తోంది కడుపులో ఎలుకల పరుగులు మెుదలైనవి.
అప్పుడే వచ్చిన ఫొన్ మీరు మా ఆఫీసుకు రాగలరా పది
నిముషాలలో.
సరే తొందరగా పని ముగించుకుని వచ్చి లంచ్ బాక్స్
తినవచ్చు లే అని
నాలో నేను అనుకొని
బయటకు వెళ్ళాను.
లాక్ డౌన్ వచ్చి ఆరు నెలలు కావస్తోంది.
మాస్క్ పెట్టుకొని బయటకు
పోయి
ఆటో కోసం వేచి వున్నాను
ఆటో మన సమయానికి రాదు.
*నీవ్వు ఎక్కవలసిన బస్సు అది నీజీవిత కాలం
మీస్సు అని ఆరుద్ర గారి మాట
అనుకుంటు వుండగా ప్రక్క జేబులో
ఫొన్ కుదురుగా వుండదు.
ఎక్కడ వున్న ప్రక్కనే నువ్వే పాట ఫొన్ లో
రింగ్ టోన్ మ్రెాగుతుంది
చూస్తే బాస్.
యస్ బాస్, ఒకే బాస్
సాయంత్రం వరకూ ఇ-మెల్ పంపుతా అని
చెప్పి ఫొన్ కట్ చేసి
వెంటనే జేబులో వేసుకున్నాను.
రాదు- రాదుగా ఆటో అనుకుంటునే తడవుగా
ఆటో వచ్చింది.
ఎమ్. ఐ.డి.సి.అదానీ ఆఫీసుకు ' చలో అన్నాను.
ఆటో వాడు గేట్ ముందు
ఆటో ఆపిండు, వారికి డబ్బులు ఇచ్చి
గేట్ దాటి లోనికి ప్రవేశించిన నాకు
చుాస్తే చాలా పెద్ద భవంతి
అద్దలతొ ఎండకు తళ తళ మెరుస్తుంది .
ముంగిట వాచ్ మెన్ దగ్గర రిజిస్టర్ లో పేరు
మొబైల్ నెంబర్ రాసి
మెుదటి అంతస్తు లోకి
వెళ్ళినా నాకు ఎవరు మనుషులు కనిపించ లేదు.
వరండా విశాలంగా పెద్ద పెద్ద కుర్చీలతొ వుంది
రెండవ అంతసు నుండి
గుసగుసల శబ్దాలు వినబడుతున్నాయి
కొంచెం భయం గా అనిపించింది
అటు ఇటు చుాస్తే ఎవరు కనిపించారే
అని మనసులో అనుకుంటునా.
రెండవ అంతస్తు పైకి
పోయే ద్వారం దగ్గర
నిలువెత్తు అంబేడ్కర్
ఫొటో ఒకటి కనిపించింది.
మనసుకు ప్రశాంతంగా
అనిపించింది.
చిన్నప్పటి మిత్రుడుని
చుాసిన అనుభుతి కలిగింది.
ఎవరు లేకుంటే ఏమిటి
అని చిన్నప్పటి ఙ్ఞాపకాలు నెమరేసుకుంటూ
కుర్చీ లో సాఫీగా కూర్చున్నాను.
నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా ఊరి మధ్య లో వున్న
అంబేడ్కర్ విగ్రహం చుట్టూ పిల్లలంతా కూర్చొని ఉదయం,
సాయంత్రం కబుర్లు చెప్పుకునే వాళ్లం.
అలా అంబేడ్కర్ విగ్రహం కానీ ఫొటో కానీ చుాస్తే
చిన్నప్పటి మిత్రుడులా ధైర్యం వస్తుంది.
**********************
వెల్మజాల నర్సింహ.10.10.20
-
రేణుకా హృదయానందం భృగవంశ తపస్వినం క్షత్రియాణాం అంతకం పూర్ణం జమదగ్న్య్ం నమామ్యహం! పండుగ అంటే : సాంప్రదాయాలు, ఆచారాలు, శాంతిసహృద్భావా...