దుప్పల్లి గ్రామ చరిత్ర

 ఆది మానవుడు నిప్పును కనుగొన్న తరువాత

నాగరికతకు బీజం పడిందని చెప్పవచ్చు. 

నిప్పుతో పాటు జీవించడానికి నీరు చాలా అవసరం

 అందుకే అప్పటి మనుషులు నదులు లేదా

 నీటి పరివాహక ప్రాంతంలో 

జీవనం ప్రారంభించారు. 

రామన్నపాడు ,తక్కల పాడు, దుబ్బలా, 

ఎర్ర కాలువ, బొళ్ల మీద, చింతల చెరువు, 

బొక్కొని గుాడెం వీటి కలయిక దుప్పల్లి. 

రామన్నపాడు గురించి చెప్పాలంటే 

కాకతీయుల చివరి రాజు పతాప రుద్రుడి నాటి కాలంలో 

అక్కడ మనుషులు జీవనం సాగించారు

 అనడానికి శిధిలమైన విగ్రహాలు,

 మట్టి  పాత్రలు నేటికీ కనిపిస్తాయి. 

రామన్నపాడు నుండి తక్కల పాడు వరకూ

 పక్కనే ముాసీనదీ  ప్రవహిస్తుంది. 

అప్పటి కాలంలో అంటు వ్యాధులు

 (కలరా)వచ్చి చాలా మంది చనిపోయే వారు.

వారిని సమాధి చేసి

మిగిలినవారు ఆ నివాసం 

వదిలి వేరే చోటుకు పోయి 

నుాతన జీవితం కొనసాగించేవారు 

అలా రామన్నపాడుని విడిచిపెట్టారు.

దుబ్బల అనే ప్రాంతం దట్టమైన చెట్లతో గుబురుగా 

వుండేది అక్కడ దుబ్బల లో  దుబ్బలు(లేళ్ళు)

 వుండేవాని కొందరు చెపుతుంటారు. 

రామన్నపాడుని విడిచిపెట్టిన జనం 

దుబ్బలలో కొత్త జీవితం 

ఆరంభించారు. 

దుబ్బలలో  వెలసిన పల్లె కావున

 దుప్పల్లి గా మారింది

దుప్పల్లికి ముాడు చెరువులు,

 పక్కనే ముాసీనదీ

 ఊరు చుట్టూ పచ్చని  పొలాలు వున్నాయి. 

*******************

వెల్మజాల నర్సింహ✍🏻



దుప్పల్లి@ బడి 1999 బ్యాచ్

రైలు ప్రయాణం ముంబయి నుండి 

మా ఊరుకి పది సంవత్సరాల తరువాత 

దసరాకు బయలు దేరాను ఎంతైనా 

పుట్టిన ఊరంటే ఎవరికి ఇష్టం వుండదండీ.

విండో సీటు కిటికీ నుండి 

మంచు కురిసిన ఉదయం పిల్ల గాలులు 

వీస్తున్నాయి. 

సుార్యడు తన కిరణాలను  మంచు బిందువులతొ

 మమేకం చేసి ప్రకృతి అందాలను రెంటింపు చేస్తున్నాడు. 

పుాణె స్టేషన్ తరువాత చిన్న పల్లెలు వస్తున్నాయి .

కొంచెం బానుడి కిరణాలు తగులుతున్నట్లుగా వుంది. 

దుారం నుండి బడి గంట వినబడుతుంది. 

నేను చిన్నపుడు చదివిన బడి  విషయాలు

 ఒకసారిగా గుర్తుకు రా సాగాయి 

మా ఊరు దుప్పల్లి పచ్చని చెట్లు వాటి మధ్య లో

 నుండి రోడ్డు .

చుాడ ముచ్చటగా వుంది మెుదటి సారి నేను 

చుాసిన మాబడి.

దేవుడు ఇచ్చిన వరం అమ్మ ఒడి  మరో గుడి బడి. 

బడి ఇప్పుడు స్కూల్  అంటేనే అర్ధం అయేంతా 

దిగజారి పోతున్నాయి .

ఏమైనా అప్పటి చదువులు వాటి తాలుకా  సంతోషలు 

చాలా అమాయకంగా వుండేవి. 

కొందరు చదువులో రాణీ స్తే మరి కొందరు కబడ్డీ 

మరియు వాలీబాల్ వంటి వాటిల్లో చాలా చురుకుగా వుండేవారు.

డొక్కు సైకిల్ వుంటే వాడే

హీరో గా భవించి  ఊరంతా కలియతిరిగే వాడు. 

గొళ్లీల ఆటలు, బావులలో ఈతలతో పాటుగా సాయంత్రం

 వ్యవసాయం పనులకై పొలం కాడికి చేరుకునే వాళ్లం. 

సాయంత్రం పుటా శనగ చేను, రేగిపండ్లు, సీతా ఫలాల

 తో పాటుగా 


ఎనుగు వెంకటిగాని కుాతలు పచ్చని వేప చెట్టు

 పై నుండి కోకిల పాటలు మట్టి వాసన 

ఎతైనా గుబురుగా వుండే గడ్డి పొదలు 

అమాయక మనుషులు 

నేటికీ కనుమరుగయే. 

మా బడికి మా ఊరే కాకుండా చిత్తాపురం,

 నర్సాపురం,గోపరాజు పల్లి మరియు పాలడుగు

 "దత్తప్ప గూడెం నుండి కుాడా చదువు

 కోవడానికి వచ్చేవారు.

గురువులంటే గౌరవ భవం వుండేది .


నాలుగు ఊర్ల పిల్లలతో 

బడి నిండుగా నెక్కర్ లాగులు,

 పాత సైకిల్స్ మరియు ఎతైనా నునుగు 

మీసాల విద్యార్ధులు వుండేవారు. 


ఇంకావుంది..