చదువుల శిఖరం (14 ఏప్రిల్ 1891)



అక్షరం అనే ఆయుధాన్ని నమ్ముకొని
దానితో కులమనే బలమైన రాక్షసి పై పొరాడి గెలిచిన వీరుడు

వ్యక్తి పూజ కంటే నీ పై నీకుండే నమ్మకమే నిన్ను గొప్ప వారిగా చెస్తుంది.

నేడు బాబాసాహెబ్ గారిని దేవుడిని చేశాం కొబ్బరి కాయలు కొట్టి పూలమాలలు 

వేసి రెండు ఫోటోలు దిగి పుట్టిన రోజులు జరుపుకొని మరిచిపోతున్నాం.
ప్రతి రాజకీయ నాయకుడికి ఈరోజు కావాలి  విగ్రహారాధనకు.

ఒక వర్గానికి దేవుడిని చేశారు ఆ వర్గం వారు కూడా సమర్థించుకుంటారు 

విగ్రహాలు పెట్టి పూజలు చేయడమే.

బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు ఎందుకు ఆదర్శం అంటే

 రాజ్యాంగం రాసిండు కదా అంటారు.

మా కులం అభ్యున్నతి కోసం పాటుపడాడు 

అని ఇంకొందరు అంటారు.

రిజర్వేషన్ల కారణంగానే ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది 

అందుకే సంఘం పెడుతున్నాం అంటారు.

గుంపులు గుంపులుగా సంఘాలలో చేరడమే
జై భీమ్ అనడానికే పరిమితమా

పుట్టిన రోజు నాడు దండలేసినంత మాత్రాన 

అంబేడ్కర్ వారాసులం అయిపోతామా

కాదుకదా అతడి ఆయుధమైన అక్షరాన్ని 

పట్టుకోని ముందుకు సాగాడమే
నిరంతరం చదువడమే చదువులో ఎంతో 

ఉన్నత శిఖరాలకు చేరినా ఆ మహానీయుడి 

అడుగుల జాడలలో నడుస్తూ
ఆదర్శభారతాన్ని నిర్మించాలి
అందుకు చదువు మన ఆయుధం అవ్వాలి

చదువు.. చదువు ముందుకు సాగు
ఊపిరి ఉన్నంత వరకు శిఖరం చేరాలి.

వెల్మజాల నర్సింహ 14.04.24

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి