మొక్క పుట్టుకను మరియు ఎదుగుదలను చెడ్డ నీళ్లు ఆపలేవు
అలాగే తన గమ్యం తెలిసిన వారికి చెప్పుడు
మాటలు మరియు చెడ్డ స్నేహం అవరోధం కాదు
జీవితమంటే ఆత్మకథ లాగా అందమైన పుస్తకమేమి కాదు ఎన్నో ఆటుపోట్ల అనుభవాల ప్రయాణం గమ్యం తెలిసిన ఆశల పేజీ అసంపూర్ణమే.
పా.రంజీత్ గారి దర్శకత్వంలో విలక్షణ నటుడు విక్రమ్ గారు నటించిన అద్భుతమైన చిత్రం 'తంగలాన్
ఇది సినిమా కాదు జీవితాలు,అణాగారిన జనం యొక్క బతుకులు.
మాకు మంచి రోజులు వస్తాయి.మా గురించి కూడా
సినిమాలు వస్తాయి అని చాటి చెప్పిన గొప్ప సినిమా.
తంగలాన్ పాత్ర పేరు అతడే యోధుడు నలుగురు పిల్లలను పోషించే దళిత తండ్రి.రెక్కల కష్టం దొచుకునే కాలం నాటి పరిస్థితులు.
భూమి కోసం భుక్తి కోసం పోరాడి గెలిచిన యోధుడి కథ.అప్పటి దొరలు నిమ్న జాతి కులాల వారిని ఏవిధంగా వాడుకున్నారొ కండ్లకు కట్టినట్లు చూపించారు. చియాన్ విక్రమ్ నటన సహజంగా మరియు సాహసోపేతంగా ఉంది.
చచ్చి బతికే కంటే పోరాడి చవడయే గొప్ప అని
నిరూపించిన సినిమా .
పుట్టిన వాడు చావక తప్పదు కానీ రోజు భయపడుతూ బతికే బతుకు కాదాని
తన వారు చనిపోతున్న పోరాటమే జీవితమని
నిరూపించిన కథ.
తెల్లదొరలు వారి పేరుని వాడుకోని స్థానిక దొరలు
భూములు లాక్కొని దౌర్జన్యంగా వెట్టిచాకిరి ఎలా చేయించుకున్నరో చరిత్రలో రాయని నిజం
ఈ సినిమాలో ఉంది.
ప్రకృతి లో కష్టించి పనిచేసే వారికి ప్రకృతే దేవుడిని
అదే సహకరిస్తుంది .
ఈ దశాబ్దకాలంలో జై భీమ్ తరువాత అంత గొప్ప సినిమా 'తంగలాన్.
వెల్మజాల నర్సింహ.18.8.24.
జాలి దయ లేని
బండరాయి అనుకున్న
వాటి మధ్యలో నుంచి
వచ్చిన మొక్కను చూశా
బండరాయి వంటి గుండెలలో
కూడా అమ్మతనం ఉంటుందని
మే - 🌞
ఏమిటో ఈ ఎండలు
భూమాత పై స్వేద రంధ్రాలు
కనిపించేంతగా
జూన్ 🌝
పచ్చదనంతో ఊపిరి
తీసుకుంటుంది భూమాత
నిన్ననే తొలకరి జల్లులు
మొదలయ్యాయి
వెల్మజాల నర్సింహ
అనగనగా ఊరిలో రాజా అనే పిరికివాడు నివసిస్తుండే వాడు . అతనికి ఏదీ చూసిన భయమే.
చుట్టూ ప్రక్కల వారు రాజాను చూసి హేళన చేసే వారు.
పేరుకే రాజా ధైర్యం లేని కాజా అని!
తాను ధైర్యవంతుడని నిరూపించుకోవడానికి చాలానే ప్రయత్నాలు చేసి నవ్వుల పాలయ్యాడు.
ఎన్నో సినిమాలు చూసినా ధైర్యం రాలేదు
నాకు ఒక రోజు వస్తుందిలే అనుకున్నాడు.
పాత సినిమాలలో లాగా వర్షం కురిసిన రాత్రి
దోమల దండు రాజా పై దండెత్తి ంది .
అక్కడ మగధీర క్లైమాక్స్ సీన్ ఒకోకరు కాదు షేర్ ఖాన్ వందమందిని ఒకే సారి పంపించు.
రాజా నరాలల్లో రక్తం ఉప్పొంగింది.
కళ్ళముందు మోత్కూరు బిక్కేరు కనిపించింది.
వెంటనే వంద దోమలనీ చంపి వాటి రక్తంతో " శత మశక సంహార వీర మీ రాజా అని రాసుకొని హాయిగా నిద్ర పోయాడు.
ఉదయం చూస్తే పేపర్ కనిపించకుండా పోయింది ఎవరు కొట్టేశారు అబ్బ'
వెల్మజాల నర్సింహ ✍🏻26.04.24