మాదిగలు తోలును నానబెట్టడం కోసం కుమ్మరివారిచే ప్రత్యేకంగా ఒక తొట్టిని తయారు చేయించేవారు. తోలును శుభ్రం చేయడానికి తంగెడు చెక్కను (తంగెడు చెట్టు బెరడును) వేరు చేసి, నీళ్లతో నింపే ఆ పెద్ద తొట్టినే ‘లందె గొల్లం’ అని పిలుచుకుంటారు. ఇది మన పూర్వీకుల జీవనోపాధిలో ఒక భాగం.
ఈ ‘లందె గొల్లం’ గురించి బ్రహ్మాండ పురాణం, రేణుకా-ఎల్లమ్మ చరిత్ర, పరశురాముడి పురాణ ఘట్టాలు మరియు జానపద కథల్లో విరివిగా ప్రాచుర్యంలో ఉన్న ఒక కథను స్మరించుకుందాం...
జమదగ్ని మహర్షి మరణం తర్వాత ఆయన కుమారుడైన పరశురాముడు, తన తండ్రిని చంపినవారు ఎవరో చెప్పమని తల్లి ఎల్లమ్మను అడుగుతాడు. అయితే, పరశురాముడికి ఇంకా సరైన వయస్సు రాలేదని భావించిన ఎల్లమ్మ తల్లి ఆ విషయాన్ని చెప్పడానికి నిరాకరిస్తుంది. దాంతో కోపోద్రిక్తుడైన పరశురాముడు తల్లిని బాధించడం మొదలుపెడతాడు.
ఆ సమయంలో అమ్మవారు తనను తాను కాపాడుకోవడానికి పారిపోతూ, మార్గమధ్యంలో వివిధ కులాల వారి ఇళ్లలో మరియు వారి వృత్తి స్థలాల్లో దాక్కుంటుంది. ఆ క్రమంలోనే ఎల్లమ్మ తల్లి చివరికి మాదిగల 'లందె'లో కూడా దాక్కుంటుంది
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి